📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్విద్యార్థి ఆత్మహత్య కి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి

విద్యార్థి ఆత్మహత్య కి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి

📰 Generate e-Paper Clip

విద్యార్థి ఆత్మహత్య కి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి.

ప్రజవాని :ప్రొద్దుటూరు పట్టణంలోని నడింపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం నందు పదవ తరగతి చదువుతున్న నరసింహులు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని సోమవారం ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,విద్యార్థుల యొక్క భద్రతను బాధ్యత వహించాల్సిన దుస్థితి చూస్తే అధికారులు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంతో ఎంత వ్యవహరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్యార్థి ఉంటున్న వసతి గృహం ఆవరణంలోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న వార్డెన్, సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని ఉందని అన్నారు. దశలవారీగా ఆత్మహత్యలు జరుగుతున్న అధికారులు ఎలాంటి రక్షణ సౌకర్యం కల్పించకపోవడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుండగా కానీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంతోనే విద్యార్థులను మరణిస్తున్నారు. వెంటనే విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకొని సమగ్రవిచారణ చేపట్టి కారకులైన వారి పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారి డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular