కురుమూర్తి దేవాలయ ఘాట్ రోడ్డు పనులను పరిశీలించిన – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
దేవరకద్ర నియోజకవర్గ పర్యటనలో భాగంగా కురుమూర్తి దేవాలయ ఘాట్ రోడ్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కురుమూర్తి దేవాలయానికి ఘాట్ రోడ్ కావాలని పట్టుబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, తనను ఒప్పించి ఈ పనులను సాధించుకున్నారని మంత్రి తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం కురుమూర్తి దేవాలయానికి మెరుగైన రహదారి సదుపాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. కురుమూర్తి దేవాలయ ఘాట్ రోడ్ పనులను జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారని వెల్లడించారు.

