కూటిగల్ నల్ల చెరువును సందర్శించిన ఇరిగేషన్ డి ఈ శ్యామ్,
గ్రామ సర్పంచ్ దాసరం బాలకృష్ణ
మద్దూరు సెప్టెంబర్ 19, ప్రజా వాణి,
మండలంలోని కూటిగల్ గ్రామ నల్లచెరువును గ్రామ సర్పంచ్ దాసరం బాలకృష్ణ ఆధ్వర్యంలో ఇరిగేషన్ డి ఈ శ్యాం,ఏఈ నజీయా శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ చెరువు తూము మరియు మత్తడి చాలా అస్తవ్యస్తంగా నీరు వృధా పోతున్న విషయాన్ని డి ఈ దృష్టికి తీసుకుపోవడంతో ఇరిగేషన్ డిఈ స్పందించి తగిన నిధులు మత్తడి మరియు తూము మరుమత్తుల కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

