గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్న ఎస్పి
జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు.
••జిల్లా పోలీస్ కార్యాలయంలో గణనాథునికి జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు.
రాజన్న సిరిసిల్ల, ప్రజావాణి
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, పోలీస్ అధికారులు, సిబ్బంది తో కలసి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి గణపతులను పూజించాలని,ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలను పాటిస్తూ పోలీస్ అధికారులకు, సిబ్బందికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈకార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్.ఐ లు మధుకర్, సురేష్, సి.ఐ మధుకర్, ఆర్.ఎస్.ఐ లు రాజు, శ్రావణ్ యాదవ్, సాయి కిరణ్, జునైద్, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.


