ఎండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ పైభాగంలో ఉన్న ప్రభుత్వ వసతి గృహ ఆవరణలో ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. వసతి గృహ సంక్షేమ అధికారి మహమ్మద్ అప్సర్ ఈ నెల 26న విధులకు వచ్చి, తన హోండా షైన్ (టీఎస్ 02 ఈకే 2566) వాహనాన్ని పార్కింగ్లో నిలిపారు. పని ముగించుకుని తిరిగి రాగా బైక్ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

