సారా తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్, వాహనం సీజ్.
8 లీటర్ల సారా స్వాధీనం. నిందితుడిపై కేసు నమోదు.
మఠంపల్లి ఆగస్టు 3 (ప్రజావాణి)
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి లోని మఠంపల్లి మండలం బాడవ తండా గ్రామానికి చెందిన బానోత్ రంగా అనే వ్యక్తి బజాజ్ సిటీ–100 వాహనంపై సారా తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాన్ని సీజ్ చేసి, 8 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిలో కానిస్టేబుళ్లు ప్రభాకర్, గోపిరెడ్డి పాల్గొన్నారు.




