టేక్మాల్ ఆగస్టు 2: మన ప్రజావాణి కుసంగి గ్రామంలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం కుసంగి గ్రామంలోని స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో కులదైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని,వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్, సంఘం పెద్దలు నారాయణ గౌడ్,అనంత గౌడ్ సత్య గౌడ్,రవి గౌడ్,లక్ష్మ గౌడ్,అశోక్ గౌడ్,విక్రమ్ గౌడ్,నారాయణ గౌడ్,కిషన్ గౌడ్, నవాజ్ గౌడ్, ఉపసర్పంచ్ సుబ్బారావు, వార్డు సభ్యుడు వెంకట్ గౌడ్, సతీష్ గౌడ్, రాజు గౌడ్, కిశోర్ గౌడ్, శశిధర్ గౌడ్, హరీష్ గౌడ్ ,సంఘ సభ్యులు మరియు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

