ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామ పంచాయతీలో సర్పంచ్, కార్యదర్శి లు తమ భార్యలు, అనామకుల అకౌంట్లలోకి లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించారని సంఘ సంస్కర్త అమరగొండ సత్యనారాయణ ఆరోపించారు. ప్రజావాణి ఫిర్యాదుపై వచ్చిన ఎంపీడీవో నిష్పక్షపాతంగా విచారణ జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పాత మోటారునే కొత్తదిగా చూపి అధిక ధరలతో నిధులు బొక్కారని, ఈ గోల్మాల్పై జిల్లా అధికారులు స్వయంగా వచ్చి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
గుల్లకోటలో గ్రామ పంచాయతీ నిధుల మళ్లింపు: సమగ్ర విచారణకు గ్రామస్తుల డిమాండ్
0
6
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -




