📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎముకల శస్ర చికిత్స బాధితురాలికి రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేత

ఎముకల శస్ర చికిత్స బాధితురాలికి రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేత

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, జూలై 20 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన రాగి రాజవ్వ ఎముకల శస్త్రచికిత్స కోసం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రూ.2.50 లక్షల ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేశారు.ఈ ఎల్వోసీ పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేదల ఆరోగ్య సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ, అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, కేడిక తిరుపతి రెడ్డి, భైర సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular