ఉప సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షులుగా గడ్డం రాజు
ప్రజావాణి శాయంపేట
ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులుగా గడ్డం రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ ల రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. గడ్డం రాజు శాయంపేట మండలంలోని రాజు పల్లి గ్రామ ఉప సర్పంచ్ గా కొనసాగుతున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నిక కాబడిన రాజును రాజుపల్లి గ్రామ సర్పంచ్ మలసాని లక్ష్మణరావు, నాయకులు గజ్జెల రాజు, సిద్దూరి మధుకర్ రావు, మలసాని తిరుపతిరావు, గడ్డం రమేష్ వార్డు మెంబర్లు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఎన్నికకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఉప సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షులుగా గడ్డం రాజు
RELATED ARTICLES




