ఎండపల్లి మండల పరిధిలోని గుల్లకోట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గౌడ కులానికి చెందిన మడ్డీ ఇందిరా (45) అనే మహిళ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా, ఉపాధి నిమిత్తం ఆమె భర్త రామయ్య ప్రస్తుతం ముంబైలో ఉంటున్నట్లు స్థానిక సర్పంచ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
0
8




