విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్
ప్రజావాణి, బీర్కూర్:
బీర్కూరు మండలం చిన్చెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మంగళవారం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, మెరుగైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, శేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పుస్తకాల పంపిణీ సందర్భంగా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.




