జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేటలో వెనుక డోర్ లేని ట్రాక్టర్ ట్రాలీతో నిర్లక్ష్యంగా మోరం (మట్టి, రాళ్లు) తరలిస్తున్న డ్రైవర్కు పంచాయతీ కార్యదర్శి షాక్ ఇచ్చారు. ప్రయాణంలో ఆ రాళ్లు రోడ్డుపై పడి ప్రజల రాకపోకలకు విఘాతం కలిగించాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన కార్యదర్శి, ప్రజా భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు సదరు డ్రైవర్కు రూ.1,000 జరిమానా విధించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.
డోర్ లేకుండా ట్రాక్టర్ రవాణా, రూ.1,000 జరిమానా విధించిన కార్యదర్శి
0
11




