- ముగిసిన అఖండ అధికమాస హరినామ సప్తహ
బీర్కూర్ ప్రజావాణి ప్రతినిధి: బీర్కూర్ మండల కేంద్రంలోని విట్ఠలేశ్వర ఆలయంలో సోమవారం పురుషోత్తమ మాస అమావాస్య సందర్భంగా పురస్కరించుకొని అఖండ హరినామ సప్తహ ముగింపు నిర్వహించారు. విఠలేశ్వర ఆలయంలో నెల రోజులపాటు మహారాష్ట్ర, బాన్సువాడ నియోజకవర్గ, తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తవార్కారులు విచ్చేసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజు కాకడ హారతి, హరిపాట్ హరి జాగరణ, కాల కీర్తన తది కార్యక్రమాలు నిర్వహించేవారు. సోమవారం సోమవతి అమావాస్య సందర్భంగా అఖండ హరినామ సప్తహ ముగింపు కార్యక్రమంలో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాల కీర్తన హ,భ,ప పిరాజీ మహారాజ్ ఆధ్వర్యంలో కాల కీర్తన నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బీర్కూర్ పరిసరాల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికమాస సప్తహ కార్యక్రమం ముగింపు నిర్వహించారు.




