📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgondaతెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
మఠంపల్లి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా జెండా వందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ (ఎంఆర్వో) మంగా మేడం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరించారు.
ఈ కార్యక్రమానికి హుజూర్‌నగర్ వ్యవసాయ శాఖ ఏడీఏ రవి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు, పాత్రికేయులు మరియు రిపోర్టర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అధికారులు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధిని ప్రస్తావిస్తూ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాల్గొన్న ప్రజలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular