బెజ్జంకి నూతన ఎస్సైగా తోట తిరుపతి బాధ్యతలు స్వీకరణ
బెజ్జంకి, మే 3(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం నూతన ఎస్సైగాతోట తిరుపతి అదివారం బాధ్యతలు స్వీకరించారు.కామారెడ్డి జిల్లాలో విఆర్ లో పనిచేస్తూ బెజ్జంకి బదిలీపై వచ్చారు.ఈ సందర్బంగా ఎస్సై తోట తిరుపతి మాట్లాడుతూ బెజ్జంకి మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతిభద్రతలు( లా అండ్ ఆర్డర్ ) పరిరక్షించడానికి కృషి చేస్తానని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మండలంలోనీ ఆయా గ్రామాల ప్రజలు ఎలాంటి ఫిర్యాదులు ఉన్న నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి సంప్రదించాలని తెలిపారు.




