📄 ePaper
Monday, April 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

📰 Generate e-Paper Clip

అన్నమయ్య జిల్లా ప్రజావాణి (ఏప్రిల్20) రాజంపేట (మం) కారంపల్లి పంచాయతీలో ని కృష్ణమ్మ చెరువు లో సోమవారం మధ్యాహ్నం అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ ను అధికారులు పట్టుకున్నారు.గత కొద్ది రోజులుగా కృష్ణమ్మ చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్న స్థానికుల సమాచారంతో ఇరిగేషన్ ,రెవెన్యూ అధికారులు దాడి చేసి ట్రాక్టర్ ను పట్టుకున్నారు.అధికారులు వస్తున్నారన్న సమాచారంతో చెరువులో ఉన్న 3 ట్రాక్టర్లు ,ఒక జెసిబి పారిపోగా ఒక ట్రాక్టర్ పట్టుబడింది.అక్రమ మట్టి రవాణా కు పాల్పడితే కటిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular