బెజ్జంకి, ఏప్రిల్ 17 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఉపాధ్యాయులు,ఉద్యోగ సంఘాల నాయకులు తహసీల్దార్ శ్రీకాంత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు.తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, హెల్త్ కార్డుల జారీ, ఓపీఎస్ పునరుద్ధరణ వంటి ప్రధాన డిమాండ్లను అధికారులు దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని తమ సమస్యలను తహసీల్దార్కు వివరించారు.

