రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ ను సన్మానించిన దూలిమిట్ట మండల సర్పంచులు
సర్పంచుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
రాష్ట్ర సర్పంచుల ఫోరం అద్యక్షులు కమలాకర్ యాదవ్
మద్దూరు సెప్టెంబర్ 19, ప్రజా వాణి,
ఇటీవల రాష్ట్ర సర్పంచుల ఫోరం అద్యక్షులుగా ఎన్నికయిన మండలంలోని జాలపల్లి గ్రామ సర్పంచ్ చెట్టుకూరి కమలాకర్ యాదవ్ ను దూలిమిట్ట మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు దూలిమిట్ట మండల కేంద్రంలోని రైతు వేదికలో శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో దోర్నాల సర్పంచ్ రాము, కూటిగల్ సర్పంచ్ దాచారం బాలకృష్ణ, దుబ్బ తండ సర్పంచ్ పాలిత్య రమేష్, లింగాపూర్ సర్పంచ్ నారాయణ రెడ్డి, రెడ్యా నాయక్ తండ సర్పంచ్ రూపేష్ నాయక్, ఏం అర్ పి ఎస్ మండల అద్యక్షులు నల్ల రాజేష్, బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

