పాఠశాల విద్యా నిధికి
10,000 రూపాయలు ఇచ్చిన సంతోష్ రెడ్డి
మక్తల్ సెప్టెంబర్ 17 (ప్రజావాణి ): మక్తల్ మండలం మాధ్వార్ గ్రామ,పాఠశాలలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన విద్యానిధి నిమిత్తం సంతోష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ,తనవంతు సేవగా 10,000 రూపాయలు విద్యా నిధికి అందించడం జరిగింది.ఇట్టి రూపాయలను ప్రధానోపాధ్యాయులు వెంకట్ రాములుకు నగదు రూపేణా పాఠశాలకు వచ్చి ఇవ్వడం జరిగింది.వారికి పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

