📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKamareddy‘ఓపెన్’ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఆరోపణలు

‘ఓపెన్’ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఆరోపణలు

📰 Generate e-Paper Clip

‘ఓపెన్’ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఆరోపణలు

ప్రజావాణి
ఏప్రిల్ :22
కామారెడ్డి జిల్లా ప్రతినిధి


రెగ్యులర్‌గా చదువుకోలేక మధ్యలోనే చదువు ఆపేసిన వారికి ప్రభుత్వం Telangana Open School Society ఆధ్వర్యంలో ఓపెన్ ఇంటర్, ఓపెన్ టెన్త్ పరీక్షల ద్వారా మరోసారి చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో సోమవారం నుంచి ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
కెమిస్ట్రీ పరీక్షలో అనుమానాలు
జిల్లా కేంద్రంలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఓపెన్ టెన్త్, మధ్యాహ్నం ఓపెన్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఇంటర్ కెమిస్ట్రీ పరీక్ష జరిగింది. అయితే కొన్ని కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న ప్రచారం జోరందుకుంది.
పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలను పరిశీలించగా మాస్ కాపీయింగ్ కోసం తీసుకువచ్చిన చిట్టీలు బయటపడినట్లు సమాచారం. ఇది పరీక్షల పారదర్శకతపై అనుమానాలకు తావిస్తోంది.
విద్యార్థులకు బదులు ఇతరులు?
పలువురు ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక్కో విద్యార్థి వద్ద రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుని మాస్ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో విద్యార్థులకు బదులు ఇతరులను అనుమతిస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి.
ఈ విషయమై విద్యాశాఖ అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. అధికారులకు తెలిసే ఈ వ్యవహారం జరుగుతోందా? లేక పర్యవేక్షణలో లోపాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పరీక్షల నిష్పక్షపాత నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.