రైతుల ముఖాల్లో ఆనందం చూడడమే తన లక్ష్యం
మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి
అనంతపురం జూలై 25 మన ప్రజా వాణి
రైతుల ముఖాల్లో ఆనందం చూడడమే తన లక్ష్యం అని మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డ్ లో ప్రతి శనివారం రైతులకు ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. నేను వారం మొత్తం ఎదురుచూసేది శనివారానికే… రైతులతో కలిసి భోజనం చేయడం, వారి ఆనందాన్ని దగ్గరగా చూడడం నా అదృష్టం. రైతుల ముఖాల్లో కనిపించే సంతోషమే నాకు మరింత సేవ చేయాలనే ప్రేరణను ఇస్తుంది. రైతు సోదరులతో గడిపే ప్రతి శనివారం నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు అని మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్
బల్లా పల్లవి స్పష్టం చేశారు.






