📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మద్యం సేవించి వాహనం నడిపిన 20 మందికి రూ.1,62,500- జరిమానా, ఒక వ్యక్తికి ఆరు (06)...

మద్యం సేవించి వాహనం నడిపిన 20 మందికి రూ.1,62,500- జరిమానా, ఒక వ్యక్తికి ఆరు (06) రోజుల జైలు శిక్ష..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా, ప్రజావాణి

సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 20మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా 06-మార్చి-2026 రోజున సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి ముందు హాజరుపరచగా విచారణ చేసి 20 మంది వ్యక్తులలో ఒకరికి ఆరు (06) రోజుల జైలు శిక్ష మిగతా 19 మందికి రూ.1,62,500- జరిమానా విధించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఒక్కొక్కరికి రూ. 5,000- చొప్పున ముగ్గురికి రూ. 15,000- జరిమాన విధించినారు.జైలు శిక్ష విధించిన వ్యక్తి వివరాలు,తుడుం కిషోర్ , వయసు 30 సం, వృత్తి. ఆటో డ్రైవర్ , నివాసం గుడికందుల గ్రా, తోగుట మండలం సిద్దిపేట జిల్లా . ఆరు (06) రోజులు జైలు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్ల ని కట్టడి చేయడానికి, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారికి ప్రమాదం రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదమని ప్రమాదాల నివారణ గురించి మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పట్టుబడిన వాళ్ల ని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ విచారణ జరిపి 10 వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. పదివేల రూపాయలు కట్టడం వల్ల మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ప్రజల్లో వాహనదారుల్లో అవగాహన రావడం జరుగుతుందన్నారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు నడిపినచో ఒక్కొక్కరికి 5000- రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular