
వైయస్సార్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) బద్వేల్ రోడ్డు పనుల ప్రారంభోత్సవం కోసం నియోజకవర్గ ఇంచార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య రచ్చ రోడ్ల ప్రారంభోత్సవం తామే చేయాలంటూ రెండు వర్గాల పట్టు రితీష్ రెడ్డి నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయిస్తే డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని ఆగ్రహం నేడు తెలుగుగంగ కాలనీలో రోడ్డు ప్రారంభోత్సవానికి ఉపక్రమించిన డీసీసీబీ చైర్మన్ అడ్డుకునేందుకు ఉదయం నుంచి మోహరించిన రితీష్ రెడ్డి వర్గీయులు విషయం తెలుసుకుని జాగ్రత్త పడ్డ డీసీసీబీ చైర్మన్ ప్రారంభోత్సవానికి రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం వద్ద రితీష్ రెడ్డి అనుచరుల హల్ చల్ తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల రంగప్రవేశం గత కొంత కాలంగా ఇరువర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్న వైనం పనుల ప్రారంభోత్సవానికి ఏ ఒక్కరికీ ప్రోటోకాల్ లేని టీడీపీ నేతల రచ్చ ప్రజలు గెలిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాసరి సుధా ఉండగా ప్రారంభోత్సవం కోసం ఏ అర్హత లేని నేతల కొట్లాట


