
నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలి ..
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
-ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్.
ధర్మారం,మన సమగ్ర ప్రజావాణి ఏప్రిల్ 10
శుక్రవారం ధర్మారం మండల కేంద్రం నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ… ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెండింగ్ లో ఉన్న పనులను పెయింటింగ్,లైటింగ్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని,కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. ప్రమోద్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




