
ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్25) రాజంపేట నియోజకవర్గంలోని పాపరాజుపల్లి గ్రామంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.పూర్వీకుల నుంచి వస్తున్న గంగమ్మ తల్లి ఆలయాన్ని గ్రామ ప్రజలే కష్టపడి తిరిగి నిర్మించుకున్నారు.ఇప్పుడు అదే ఆలయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదంలోకి లాగడం ఖండనీయం. దారి పేరుతో దేవాలయంపై కన్నేయడం అసహ్యం ప్రజల మధ్య చిచ్చు పెట్టే పసుపు నేతల ఆటలు ఆపాలి!గ్రామ ప్రజల స్పష్టమైన మాట గంగమ్మ తల్లి ఆలయం మా ఆత్మగౌరవం ఆలయం మధ్యలో దారి ఇవ్వం,ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు సాంప్రదాయాలపై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం హెచ్చరిక:దేవాలయాల జోలికి వస్తే గ్రామ ప్రజలు నిశ్చలంగా ఉండరు.నాయకుల ముసుగులో అధికారులు చేయరానిది చేస్తే బాధ్యత తప్పదు సాంప్రదాయం మా హక్కు,దాన్ని కాపాడటం మా బాధ్యత!”ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి:ప్రజల భావోద్వేగాలను గౌరవించండి.రాజకీయ ఒత్తిడులకు లోనవకుండా న్యాయం చేయండి.ప్రభుత్వ అధికారులు ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి.ఊరు కట్టుబాట్లను ఊరు దేవతను అవమానిస్తే ఊరుకోం.


