చిలుకూరు మార్చి 26 🙁 ప్రజావాణి )తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులుగా బెల్లంకొండ ప్రభాకర్ నియమిస్తూ, సూర్యాపేట జిల్లా తెలంగాణ ఉద్యమ కారుల ఫోరమ్ అధ్యక్షులు గుండె పంగు రమేష్ చేతుల మీదుగా నియమక పత్రం గురువారం అందించారు,ఈ సందర్భంగా, అధ్యక్షులు బెల్లంకొండ ప్రభాకర్ మాట్లాడుతూ,తెలంగాణ ఉద్యమకారులకు రావలసిన సంక్షేమ ఫలాలను వచ్చే వరకు తమ పోరాటం చేస్తామన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు భాగంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల ఇంటి స్థలం ఉద్యమకారులకు పింఛన్ ఉద్యమకారులకు గుర్తింపు కార్డు సాధించేవరకు మలిదశ ఉద్యమకారులను ఐక్యం అయ్యి ప్రభుత్వం పై పోరాటం చేస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో ఉద్యమకారులు ఐక్యమై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో, అంబాల వెంకటి, బెల్లంకొండ వేలాద్రి, దుగ్గెబోయిన శీను, కైలాసపు ఏడుకొండలు, మేకపోతుల శీను, యలగొండ ప్రభాకర్, కైలాసపు నాగయ్య, దుగ్గెబోయిన రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.




