📄 ePaper
Monday, March 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్గర్భిణీ స్త్రీకి రూ. 30 వేల ఆర్థిక సాయం మానవత్వానికి మారుపేరు సీఐ విజయలక్ష్మి:

గర్భిణీ స్త్రీకి రూ. 30 వేల ఆర్థిక సాయం మానవత్వానికి మారుపేరు సీఐ విజయలక్ష్మి:

📰 Generate e-Paper Clip

కడపప్రజావాణిన్యూస్(మార్చి27)బ్రహ్మంగారిమఠం:నేటి యాంత్రిక జీవనంలో తోటి మనిషి కష్టాన్ని చూసి స్పందించే గుణం మృగ్యమైపోతున్న తరుణంలో,నేనున్నానంటూ ముందుకొచ్చి తన ఉదారతను చాటుకున్నారు సీఐ విజయలక్ష్మి గారు.పోలీసు యూనిఫాంలో ఉన్నా,తన గుండె నిండా నిండిన మానవత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు.కర్నూలు జిల్లా మహిళా విభాగం సి.ఐ.శ్రీ విజయలక్ష్మి గారు. బ్రహ్మంగారిమఠం మండలంలోని నరసన్నపల్లె గ్రామానికి చెందిన సోమిరెడ్డిపల్లె జగన్ సతీమణి శ్రీమతి రేణుక ప్రస్తుతం 9 నెలల నిండు గర్భిణీ.ప్రసవ సమయం ఆసన్నమవుతున్న వేళ,ఆ కుటుంబం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను తెలుసుకున్న విజయలక్ష్మి గారు తక్షణమే స్పందించారు.డెలివరీ ఖర్చుల నిమిత్తం ఏకంగా 30 వేల రూపాయల భారీ ఆర్థిక సాయాన్ని అందజేసి,ఆ పేద కుటుంబానికి కొండంత అండగా నిలిచారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.సమాజ సేవలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని,ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలోనే అసలైన సంతృప్తి ఉందని పేర్కొన్నారు.ఒక నిండు గర్భిణీ కన్నీరు తుడిచి,పుట్టబోయే బిడ్డకు భరోసానిచ్చిన విజయలక్ష్మి గారి ఉదారతపై మండల వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇలాంటి గొప్ప మనసున్నవ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని స్థానికులు కొనియాడుతున్నారు.డబ్బు ఉండటం గొప్ప కాదు.దాన్ని తోటివారి కష్టానికి ఖర్చు చేసే’గుణం’ఉండటం అదృష్టం. విజయలక్ష్మి గారు కేవలం డబ్బు ఇవ్వడం లేదు.ఒక నిండు ప్రాణానికి భరోసానిచ్చారు.స్వార్థం రాజ్యమేలుతున్న వేళ ఆమె ఒక వెలుగు కిరణంలా,ఆపదలో అండగా నిలిచే ఒక నిజమైన ఆపద్బాంధవురాలిలా నిలిచారు.పది మందికి సాయం చేయాలనే తపన ఉన్న ఒక అరుదైన వ్యక్తిత్వం ఆమెది. విజయలక్ష్మి గారు చేసిన ఈ నిస్వార్థ సేవకు మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం.ఈ వార్త చదువుతున్న ప్రతి ఒక్కరూ మనస్పూర్తిగా ఆమెకు అభినందనలు తెలపడమే.శభాష్ సీఐ విజయలక్ష్మి గారు! మీ సేవా ప్రస్థానం ఇలాగే కొనసాగాలి.మీ అడుగుజాడల్లో మరికొందరు నడవాలి!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular