సిద్దిపేట జిల్లా, మార్చి 8, ప్రజావాణి
ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగిన క్రీడా పోటీల్లో ప్రభుత్వ, పాలిటెక్నిక్ హుస్నాబాద్ కోకో జట్టు అసెంబ్లీ నియోజకవర్గ నిలిచిన సందర్బంగా ఆదివారం రోజున కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్
,చేతుల మీదుగా అవార్డును అందుకోవడం జరిగిందని పాలిటెక్నిక్ కళాశాల యజమాన్యం తెలిపింది. ఈ సందర్బంగా కళాశాల విద్యార్థుల ఆటతీరు పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ హుస్నాబాద్ ప్రిన్సిపల్ పంచదార దేవి,తెలిపారు.అనంతరం విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. ముందు ముందు పార్లమెంట్ స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో జాతీయస్థాయిలో క్రీడలు రాణించాలని మంత్రి ఆకాంక్షించారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు ఉండాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో హెచ్వోడీలు శ్రీను, ఇందు, గీతా రాణి,ఓస్ వెంకటేశం, కళాశాల ఇంచార్జ్ పిడి మోహన్ నాయక్, ఉపన్యాసకులు ,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




