అమ్మగూడెంలో ప్రజా పాలన పనులు వేగవంతం
సర్పంచ్ పొట్ట లక్ష్మీ శేఖర్ ఆధ్వర్యంలో..
నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి మార్చి 13 శుక్రవారం
తెలంగాణ రాష్ట్రంలో 99 రోజుల ప్రజా పాలన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వేళ నేలకొండపల్లి మండల పరిధిలోని అమ్మగూడెం గ్రామపంచాయతీలో సర్పంచ్ పొ ట్ట లక్ష్మీ చంద్రశేఖర్ ఉప సర్పంచ్ వాసంశెట్టి వేణు ప్రజా ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ప్రధాన సమస్యలపై దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి చేయటం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు సుంకర శ్రీను రవి శంకర్ చంద్రం బ్రహ్మం శ్రీను కోటయ్య వెంకయ్య సత్యం గ్రామ పాఠశాల సిబ్బంది తో పాటు అంగన్వాడి కళావతి తదితరులు పెద్దలు పాల్గొని ప్రసంగించారు.




