*మధిర లో కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం*
మధిర మన సమగ్ర ప్రజావాణి మార్చ్21
మధిర లో గతం లో దెందుకూరు రోడ్డు లో కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం జరగడం ఇన్సూరెన్స్ కంపెనీ వారు వచ్చి రైతులకు కోల్డ్ స్టోరి యాజమాన్యానికి బ్యాంకులకు చెల్లింపు చేయడం జరిగింది
గత సంవత్సరం వర్షాకాలంలో కోల్డ్ స్టోరేజ్ లో నీరు వచ్చాయని మిరపకాయలు తడిసిపోయాయని రైతులకు నష్టం కలగ కూడదని కోల్డ్ స్టోరేజ్ ల యాజమాన్యం ఇన్సూరెన్స్ కంపెనీ నుండి సుమారు 6 కోట్ల రూపాయలు వరకు రైతుల పేరున తీసుకున్నట్లుగా సమాచారం.
ఈ రోజు జరుగుతున్న అగ్ని ప్రమాదం లో నష్టపోతున్న రైతులు ఎవరు బ్యాంకు లోన్లు ఎంత ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం స్వంత గా ఖరీదు చేసి నిల్వ ఉన్న సరుకు ఎంత అనే విషం తెలియ వలసింది
కోల్డ్ స్టోరేజ్ కి అసలు ఇన్సూరెన్స్ ఉన్నదా రెన్యువల్ చేశారా ఎంత మొత్తానికి ఇన్సూరెన్స్ జరిగి ఉన్నది
ఫైర్ సేఫ్టీ ప్రామాణికం ప్రకారం గా నిర్మాణం జరిగిందా అనే విషయాన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీ పరిశీలిస్తుంది
అసలు ప్రమాదాన్ని గల కారణాలు ఏమిటి
ఏది ఏమైనప్పటికీ రైతులకు నష్టం లేకుండా యాజమాన్యం పూర్తిస్థాయిలో పరిహారం అందించాల్సిన అవసరం ఉన్నది.




