సిద్దిపేట జిల్లా, మర్కుక్, మార్చి 9, ప్రజావాణి
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో
ఏం పీ పీ ఎస్, ప్రైమరీ స్కూల్ ముందు ఉన్న పరిసరాలలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మార్చారు.గ్రామంలోని గ్రామపంచాయతీ సపాయి కార్మికులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకోవాలని ఉద్దేశంతో, ఈ శుభ్రత కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం,వల్ల పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు, గ్రామంలో శుభ్రతపై అవగాహన కూడా పెరుగుతుందని గ్రామపంచాయతీ, సర్పంచ్ భవాని, బాలకిషన్, గ్రామపంచాయతీ సెక్రటరీ, సపాయి కార్మికులు తెలిపారు.




