ఉమేష్ చంద్ర ఐపీస్ మెమోరియల్ క్రికెట్ టోర్నీ
ప్రజా ప్రతినిధి కూనవరం మండలం ఫిబ్రవరి 19

పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం పోలీస్ స్టేషన్ ఐపీఎస్ మెమోరియల్ క్రికెట్ టోర్నీ ఉమేష్ చంద్ర గ్రౌండ్ లో ఇనాగ్రేషన్ చేసిన ఐటీడీఏ పీఓ శుభం నౌక్వల్ ప్రారంభించి చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం చొప్పలీ మరియు వి.ఆర్.పురం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కడబాల సుధ( విశ్వ హిందూ రామసేన ఇంచార్జ్ , పోలవరం జిల్లా ), టిడిపి మండల అధ్యక్షులు యడవల్లి భాస్కర్, బిజెపి నాయకులు పాయం వెంకయ్య, నోముల రామారావు, వైసీపీ నాయకులు ఆవుల మరియదాసు, సింజంట కంపెనీ యాలం రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది..




