జైపూర్,జూలై22,ప్రజావాణి:
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం జైపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




