📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialమున్నూరు కాపు సంఘ నాయకులకు ఘన స్వాగతం

మున్నూరు కాపు సంఘ నాయకులకు ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

*మున్నూరు కాపు సంఘ నాయకులకు ఘన స్వాగతం*

*మన ప్రజావాణి* మందమర్రి:- జులై 19

పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణానికి విచ్చేసిన మున్నూరు కాపు సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులకు ఘన స్వాగతం పలికారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తం పటేల్, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇంచార్జ్ ఇందూరి తిరుపతి పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబిపు శ్రీనివాస్ పటేల్, రాష్ట్ర కార్యదర్శి గాదె సత్యం పటేల్, జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ పటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్ట లక్ష్మణ్ పటేల్ లు పట్టణానికి విచ్చేయగా, వారికి పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మిట్ట లక్ష్మణ్ పటేల్, పార్వతి రాజిరెడ్డి పటేల్ ల ఆధ్వర్యంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించి, ఘన స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు రాకం సంతోష్, బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్, బట్టు శ్రీనివాస్,కడారి శ్రీధర్, మాదాసు కుమార్, ఉప్పు రవి, తెండ్ర శ్యాం, బద్రి సతీష్, సాతిని శ్రీనివాస్, పాదం రవీందర్, బేర వేణుగోపాల్, సకినాల రాజు, స్వాతిని సంజీవ్, మిల్కూరి సుధాకర్, పెంచాల రాజు, నారా లింగయ్య, కాసర్ల శ్రీనివాస్, బుబత్తుల శ్రీనివాస్, సిద్ధం తిరుపతి, అగ్గు శ్రీనివాస్, అట్టపల్లి శ్రీనివాస్, సంగర్తి సంతోష్, సకినాల శంకర్, కులకాని రాజు, గాండ్ల సంజీవ్, గాజుల విజయ్, సంఘం యువజన నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular