*సాంబశివరావు, ప్రసాద్ వేధింపులతోనే కార్మికుడు కిషోర్ ఆత్మహత్య* 
*నాటుకో ఫార్మా పరిశ్రమ ముందు శవంతో ఆందోళన – ఉద్రిక్తత*
షాద్ నగర్ ప్రజావాణి మే 20:
కొత్తూరు నాటుకో ఫార్మా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు కిషోర్ ఆత్మహత్యకు కంపెనీకి చెందిన సాంబశివరావు, ప్రసాద్ ఇరువురే కారణమని కిషోర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ పరిశ్రమ ముందు శవంతో మెరుపు ధర్నాకు దిగారు. వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వెంటనే అరెస్టు చేయాలని కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున కంపెనీ ముందుకు తరలి రావడంతో పోలీసులు వారిని సముదాయిస్తున్నారు…



