సిరిసిల్లలో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకదానికొకటి డికొన్నట్టు సమాచారం.
••క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలింపు.
••పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి/ప్రజావాణి
సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడు – వెంకటాపురం బైపాస్ రోడ్డుపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీకొన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తూ ట్రాఫిక్ను నియంత్రించారు. ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం అందుతున్నప్పటికీ, క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


