సిద్దిపేట్, ఏప్రిల్ 20, ప్రజావాణి
బసవేశ్వర జయంతి ఉత్సవాలు సందర్భంగా జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల బైపాస్ చౌరస్తా వద్ద గల బసవేశ్వర విగ్రహానికి జిల్లా కలెక్టర్ కె హైమావతి, పూలమాల వేసి
నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సయ్యద్ రఫీ, వివిధకుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు..



