* శివయ్యకు వెండి నాగాభరణం సమర్పించారు
నంద్యాల జిల్లా శ్రీశైలం ఏప్రిల్ 18 (ప్రజావాణి)
నిన్న శ్రీ యం. నవ్యరవీంద్రారెడ్డి, హైదరాబాద్ వారు అయిదు శిరస్సులతో కూడిన వెండి నాగాభరణాన్ని దేవస్థానమునకు సమర్పించారు. వెండి నాగాభరణం బరువు 2 కేజీల 400 గ్రాములు.
ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపములో దాతలు వీటిని అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు విజయస్వామి, ఉప ప్రధానార్చకులు యం. శివశంకరయ్య, పర్యవేక్షకులు గంజి రవి, అమ్మవారి ఆలయం ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జునలకు అందజేశారు.
అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందజేయడం జరిగింది.
* శివయ్యకు వెండి నాగాభరణం సమర్పించారు
RELATED ARTICLES




