బెజ్జంకి,ఏప్రిల్ 15(ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోనీ గాగిల్లాపూర్ గ్రామంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్న గ్రామ దేవత పోచమ్మ తల్లి పునఃప్రతిష్ఠ మహోత్సవాలకు హాజరుకావాలని గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి-రాజు, ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులతో కలిసి బెజ్జంకి తహసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో కడివేరు ప్రవీణ్, హెడ్ కానిస్టేబుల్ కనుకయ్యకు ఆహ్వాన పత్రికలను అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ఈ మహోత్సవాన్ని గ్రామ ప్రజలందరూ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, మాజీ సర్పంచ్ మాసం శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు పైడిపల్లి శంకర్, ఆరేటి తదితరులు పాల్గొన్నారు.

