సిద్దిపేట్ ఏప్రిల్ 9, ప్రజావాణి
సిద్దిపేట్ జిల్లా కలెక్టర్ కె. హైమావతి
కలెక్టరేట్ పక్కనగల ఈవీఎం గోదాంను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నెలవారీ పరిశీలనలో భాగంగా గోదాం చుట్టూ కలియ తిరిగారు. లాగ్ బుక్ చెక్ చేసి విజిటర్స్ రిజిస్టర్ లో సంతకం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చుట్టు సిసి కెమెరాల పనితీరు, పోలిస్ అధికారులు 24/7 గట్టి బందోబస్తు నిర్వహించాలని అలాగే ఈవిఎం గోదాం పరిసర ప్రాంతాన్ని పర్యవేక్షణ చెయ్యాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.




