చిత్తూరు ఫిబ్రవరి 9 ప్రజావాణి: చిత్తూరు జిల్లా కేంద్రంలోని గాంధీ సర్కిల్ చిత్తూరు నందు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు, బాల్యవివాహాల రహిత కార్యక్రమాన్ని, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి వెంకటేశ్వరి ఆధ్వర్యంలో బాల్య వివాహాల రహిత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాల్య వివాహ రహిత కార్యక్రమాల పైన గాంధీ విగ్రహం కూడలిలో హర్యానా అంకుర్ కళాజాత బృందం చే బాల్యవివాహాలు, మరియు మహిళా సమస్యలపై హెల్ప్ లైన్ నెంబర్స్, అలాగే అనుబంధ కార్యక్రమాలపై డబ్బులు వాయిస్తూ పాటలు పాడుతూ పోస్టర్లను ప్రదర్శిస్తూ అవగాహన కార్యక్రమాలు చేయడం జరిగింది. అనంతరం బాల్యవివాహాల వల్ల జరిగే కష్టనష్టాలను నాటిక ప్రదర్శన రూపంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సి బ్బందులు తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహ రహితపై అవగాహన
0
78
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -




