*ప్రజలను మోసాగించాలని చూస్తున్న కాంగ్రెస్,బి.ఆర్.ఎస్*
••కాగ్రెస్ ప్రభుత్వం లో పైసలు లేవు..బి.ఆర్.ఎస్ ఎం.ఎల్.ల కు పైసలు రావు అభివృద్ది ఎలా..?
••పట్టణాభివృద్ధి కింద పైసలస్తే వాటిని జీతలకు వాడుతున్నారు.
•••బి ఆర్ ఎస్ పార్టీ 10 సం అధికారం లోఉండి సిరిసిల్ల కు ఎం చేసింది…?
•••బి ఆర్ ఎస్ కు అధికారం రాష్ట్రంలో లేదు.. కేంద్రం లో లేదు.ఏ రకంగా అభివృద్ధి చేస్తారో…?
•••మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డీబోయిన గోపి ఆగ్రహం.
రాజన్న సిరిసిల్ల/ప్రజావాణి
మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల లో వార్డ్ వార్డ్ కు తిరుగుతూ ప్రజలను మోసాగించాలని కాంగ్రెస్ పార్టీ, బి ఆర్ ఎస్ పార్టీ లు చూస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మండిపడ్డారు. సిరిసిల్ల పట్టణంలో ని బీజేపీ పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….
సిరిసిల్ల లో వార్డ్ వార్డ్ కు తిరుగుతూ కేటీఆర్ ప్రజలను మోసగించే ప్రయత్నాలు చేస్తున్నడని అన్నారు.
ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీ ని తిరస్కరించిన విషయం తెలియదా..?అని గుర్తు చేశారు.
సర్పంచ్ ఎన్నికల్లో మేజర్ గ్రామపంచాయతి లు చేజారిపోయినాయి.మున్సిపల్ చైర్ దక్కకపోతే ముళ్ళేముఠా కట్టుకొని వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.
ప్రజలను ప్రలోబాలకు గురిచేస్తూ, మోసాగించాలని చూస్తున్న బి ఆర్ ఎస్.పార్టీ అని అన్నారు.బి ఆర్ ఎస్ ఏం.ఎల్.ఏ కు ఒక్క రూపాయి రాదు. మీకెలా అభివృద్ధి చేస్తాడు.అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం లో పైసలే లేవు మున్సిపల్ ఎన్నికల్లో హామీలు ఇస్తున్నారు ఎక్కడినుండి అభివృద్ధి చేస్తారని అన్నారు.స్వయనా ముఖ్య మంత్రి గారే నన్ను కోసిన ఒక్క రూపాయి లేదు అన్నోడు మనకేం చేస్తాడని వాపోయారు.గత ప్రభుత్వం చేసిన అప్పులను కడుతున్న అభివృద్ధి చెయ్యలేక పోతున్న అంటూ మీడియా సమావేశం లో ముఖ్య మంత్రి చెప్పాడని గుర్తు చెశారు.
ఫోర్టింతు, ఫిఫ్టీంత్ ఫైనాన్స్ ద్వారా మున్సిపాల్టీలు నడుస్తున్నాయని,
అర్బన్ డెవలప్ కింద సిరిసిల్ల కు 15 కోట్ల రూపాయలు ఇచ్చినం. త్రాగునిటీ పరిష్కారాని కోసం 1వంద 4కోట్ల రూపాయలు సంక్షన్ చేసినం.
కేంద్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరుగుతున్న విషయాన్నీ ప్రజలు గమనించాలని కోరారు.వేములవాడ, సిరిసిల్ల లో కాషాయ జెండా ఎగరావేస్తామని తెలిపారు




