పెళ్లిరోజు సందర్భంగా పండ్లు పంపిణీ
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 13 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట, రాజారాంపల్లి గ్రామాలలో శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఆర్యవైశ్య ముద్దుబిడ్డ టీజీ వెంకటేష్ దంపతుల పెళ్లి రోజు శుభ సందర్భంగా, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పుల శ్రీనివాస్ గుప్త స్వప్న దంపతుల పెళ్లిరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్తా మండలంలోని అంబారి పేట ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు, రాజరాంపల్లి హమాలీ కూలీలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా వారు ఆ దంపతులు కలకాలం పిల్లాపాపలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.




