📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పలువురి ఆహ్వానం మేరకు కూనవారిపల్లె శ్రీ గంగమ్మ జాతరకు హాజరైన రెడ్యo సోదరులు.

పలువురి ఆహ్వానం మేరకు కూనవారిపల్లె శ్రీ గంగమ్మ జాతరకు హాజరైన రెడ్యo సోదరులు.

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి15)ఖాజీపేట మండలం, కూనవారిపల్లె లో శ్రీ గంగమ్మ జాతర ఘనంగా జరిగింది.గ్రామంలోని వైఎస్ఆర్సిపి నేతలు కూన నాగిరెడ్డి,భూమన సుబ్బారెడ్డి, పాపిరెడ్డి రామలింగారెడ్డి కుటుంబాలతో పాటు పలువురి ఆహ్వానం మేరకు ఆదివారం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యo వెంకటసుబ్బారెడ్డి వైఎస్ఆర్సిపి నేత కేసీ కెనాల్ ప్రాజెక్ట్ మాజీ వైస్ చైర్మన్ రెడ్యo చంద్ర శేఖర్ రెడ్డి లు హాజరైనారు.రెడ్యo సోదరులు ముందుగా శ్రీ గంగమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలువురి గృహాలకు వెళ్లి వారిని పలకరించి.విందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నేతలు మండల యువ జన విభాగం అధ్యక్షుడు ముత్తూరు రమణ,మున్నెల్లి చిన్న తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular