*పరీక్షలంటే విద్యార్థులు భయపడొద్దు*
*భయం వీడితే జయం మనదే*
*పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు*
*గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్*
టేక్మాల్ మార్చి 12 (మన ప్రజావాణి) పంపిణీవిద్యార్థులు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురకకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కుసంగి గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్ అన్నారు.సర్పంచ్ సహకారంతో స్థానిక చైతన్య యూత్ ఆధ్వర్యంలో గురువారం రోజు పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు,యూత్ సభ్యులతో కలిసి పరీక్ష సామాగ్రి అందజేశారు.ఎగ్జామ్ ప్యాడ్స్ తో పాటు పెన్నులు,స్కెచ్ తదితర సామగ్రి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితంలో విద్యార్థులకు 10 వ తరగతి తొలి మెట్టులాంటిదని ప్రతి ఒక్క విద్యార్థి ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా దైర్యంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.సమయానికంటే ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రసన్నవదన ,పాఠశాల ఉపాధ్యాయులు,చైతన్య యూత్ సభ్యులు వెంకట్ గౌడ్,మహిపాల్,కిరణ్ రెడ్డి,సతీష్ తదితరులు పాల్గొన్నారు.




