📄 ePaper
Friday, March 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తొట్టిగారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ సమావేశము

తొట్టిగారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ సమావేశము

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మార్చి 10) బద్వేల్ మండలము తొట్టిగారి పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ మరియు  జరపడమైనది. ఈ సమావేశము నందు డాక్టర్ జి. రాజేష్ కుమార్ పాల్గొని ఆశా కార్యకర్తల అజెండా,.హెచ్ పి వి వ్యాక్సిన్ యొక్క ఆవశ్యకత,14 సంవత్సరాల ఆడపిల్లలకు వ్యాక్సి వేసే విధానము మరియుఅమ్మాయికి వివాహ వయసు గురించి బ్యాలన్స్ డైట్ గురుంచి బాడీ మాస్ ఇండెక్స్ గురించి,ప్రెగ్నెన్సీ కిట్స్ చైల్డ్ మ్యారేజసెస్ గురించి టీబీ గురించి రొటీన్ వ్యాక్సిన్ గురించి ఆశా కార్యకర్తలకు మరయు ఆరోగ్య కార్యకర్తలు కు సిబ్బందికి వివరించడం అయినది, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభయన్ కార్యక్రమం ప్రతినెల తొమ్మిది తారీకు నుండి 12 వ తారీకు లోపల జరుగును అని అదేవిధంగా గర్భిణీ స్త్రీలందరూ వచ్చి ఆరోగ్య పరీక్షలు చేపించుకొని ఆరోగ్య స్థితిని కనుక్కొని కష్టతరమైన గర్భిణీ స్త్రీలను గుర్తించడానికి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కావున ప్రతి గర్భిణీ స్త్రీని పోషకాహారలో లేకుండా రక్తహీనత లేకుండా చూసుకొని ఆశా కార్యకర్తలు,ఆరోగ్య కార్యకర్తలు ఇచ్చినటువంటి ఐరన్ మాత్రలు తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఆరోగ్య విద్య ద్వారా గర్భిణీ స్త్రీలకు వివరించడమైనది.ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె.చంద్రవతి, విలేజి హెల్త్ క్లినిక్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆరోగ్య కార్యకర్తలు ఆశలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular