సిద్దిపేట జిల్లా,
మార్చి 8, ప్రజావాణి
చేబర్తిముదిరాజ్ సంఘం నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ అధ్యక్షులు పోయిల కనకయ్య ప్రధాన కార్యదర్శి రమేష్, కనకయ్య సంయుక్తకార్యదర్శి స్వామి,వార్డ్ మెంబర్ పోయిల లావణ్య, ఆంజనేయులు,ను తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది కొట్టాల యాదగిరి, మర్యాదపూర్వకంగా శాలువతో వీరిని సన్మానించడం జరిగింది.ఆయన మాట్లాడుతూ. ముదిరాజులంతా ఐకమత్యంగా ఉండాలని ముదిరాజ్ వివిధ పార్టీలలో కొనసాగినప్పటికీ వారిని గెలిపించుకోవడం కోసం అందరూ కృషి చేయాలని కోరారు,అప్పుడే ముదిరాజులు అన్ని రంగాలలో ముందుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో తోట కృష్ణులు, పోయిల మల్లేశం,తోట సాయిలు, దేశమైన కనకయ్య, గుర్రాల నరేష్, పోయిల జాంగిరి,తోట సత్యం, కొంతం కనకయ్య, గుర్రాల భాను, పోయిల సత్యనారాయణ, గుర్రాల కుమార్, తోట గణేష్, తదితరులు పాల్గొన్నారు.




