ఘనంగా మద్దుల గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 27 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, స్థానికులు మద్దుల గోపాల్ రెడ్డి 53 వ జన్మదిన వేడుకలను గ్రామ సర్పంచ్ కొడిపెల్లి కొమురమ్మ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో యువకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ…గోపాల్ రెడ్డి నాయకుడే కాదు, ప్రజల సమస్యల పై సానుకూలంగా స్పందిస్తూ దూసుకు వెళ్తున్న నాయకుడని కొనియాడారు, రానున్న రోజుల్లో జడ్పీటీసీ పదవిని చేపట్టాలని ఆకాంక్షిస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కట్కూరి గణేష్, శేఖర్, సాగర్, దుర్గం పవన్, హరీష్, చెల్పూరి రమేష్, శ్రావణ్, కొడిపెల్లి వంశీ, బండారి రాకేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




