కాకతీయ వర్సిటీలో చోరీ నెపం…!
మనస్తాపంతో విద్యార్థిని మృతి.
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
కేయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్న ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన శ్రీవిద్య (20)
పద్మాక్షి హాస్టల్ బి–బ్లాక్లో ఉంటున్న సమయంలో కొందరు సీనియర్ విద్యార్థులతో వివాదం
ల్యాప్ టాప్, బంగారం చోరీ చేసిందని ఆరోపిస్తూ శ్రీవిద్యపై ఈనెల 2న వర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఆ వస్తువులకు సంబంధించి డబ్బు చెల్లించాలని శ్రీవిద్య తల్లిదండ్రులకు పోలీసుల సమాచారం
పోలీసుల విచారణ అనంతరం శ్రీవిద్యను ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా దుందిరాలపాడు గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళిన తల్లి అంజమ్మ
మనస్థాపంతో ఈనెల 7న ఎలుకలు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీవిద్య
తనపై సహచర విద్యార్థులు దాడి చేశారని వీడియోలో తెలిపిన శ్రీవిద్య
హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ ఘటనపై మధిర పీఎస్లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు బంధువులు విషాదంలో మునిగిపోయారు.




